కర్నూల్: నగరాలు, పట్టణాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు శుభవార్త. మహిళల వసతి కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరుతో 30 కొత్త వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో హాస్టల్లో 30 మందికి వసతి కల్పించబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులతో పాటు చదువుకునే యువతులకు తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నారు.