SDPT: పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్న వార్తలతో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో, వాహనదారులు దాదాపు రెండు గంటల పాటు క్యూలో నిలబడాల్సి వస్తోంది. కొన్ని బంకుల్లో స్టాక్ అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.