KRNL: చిప్పగిరి మండలంలో వికలాంగులు సదరం సర్టిఫికెట్ పొందేందుకు అవసరమైన స్లాట్ బుకింగ్ ఇవాళ్టి నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభం కానుందని ఎంపీడీవో అల్లా బకాష్ తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాలతో సచివాలయాలను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రజలకు సులభంగా సేవలు అందించడమే లక్ష్యం అని పేర్కొన్నారు.