ATP: ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలో బుధవారం నుంచి శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. 3 రోజుల పాటు నిర్విరామంగా ఆలయంలో భజనలు ఉంటాయని తెలిపారు. 27న విజయనగరం నుంచి భజన బృందం వస్తున్నట్లు తెలిపారు. రథంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28న గోపూజ, జమ్మిపూజ కార్యక్రమంతో పాటు అన్నదానం ఉంటుందన్నారు.