యాదాద్రి: కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేస్తారన్న నేపథ్యంలో మోత్కూర్ కొత్త అసెంబ్లీ నియోజకవర్గంగా మారుతుందనే చర్చ కొనసాగుతుంది. మోత్కూర్, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూర్, మండలాలను కలిపి దీనిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నాలుగు మండలాలలో కలిపి సుమారు 1,80,000 పైగా జనాభా ఉండడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.