E.G: కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ నారాయణపురం వాంబే గృహాల వద్ద నగర పాలక సంస్థ చేపట్టిన ఆక్రమణల తొలగింపుతో ఉపాధి కోల్పోయిన 12 మందికి వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే.. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్ధిక సహాయం అందించారు. కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.