KMM: కేసీఆర్ పాలనలో రహదారులు అద్వానంగా ఉండేవని, కానీ ప్రజా ప్రభుత్వం రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతుందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం ఏన్కూరు మండలం గార్ల ఒడ్డులో రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.