ASR: క్షయ రహిత సమాజం కొరకు అందరూ కృషి చేయాలని డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ పీహెచ్సీ డా కుమార్ రత్న పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురష్కరించుకుని అరకు సంతబయలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే 100% నయం చేయవచ్చన్నారు.