ప్రధాని మోదీ ఈ నెల 25న ఇజ్రాయెల్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కోసం జెరూసలేంలో ఎదురుచూస్తున్నట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ బంధం ఇద్దరు ప్రపంచ నాయకుల శక్తిమంతమైన కూటమి అని అభిప్రాయపడ్డారు. తాము ఇన్నోవేషన్, రక్షణ, వ్యూహాత్మక దార్శనికతలో భాగస్వామ్యులమని.. ఉన్నత శిఖరాలకు చేరేందుకు AI మొదలు ప్రాంతీయ సహకారం వరకు తమ బంధం ఇలాగే ఉంటుదన్నారు.