BPT: పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సంతమాగులూరులో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఎంపీడీవో జ్యోతిర్మయి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామాల పరిశుభ్రత, అభివృద్ధిలో వారి కృషి ముఖ్యమని తెలిపారు. అనంతరం గ్రీన్ అంబాసిడర్లకు శాలువాలు కప్పి గౌరవించారు.