PDPL: కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ రాఘవాపూర్, శాంతినగర్లోని వేర్ హౌసింగ్ గిడ్డంగులను తనిఖీ చేశారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు దృష్ట్యా గోదాములలోని బియ్యాన్ని త్వరగా లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ధాన్యం నిలువ చేసేందుకు వీలుగా స్థలాలు కేటాయించాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ వేణు ఉన్నారు.