కోనసీమ: ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసుపై డీఎస్పీ ప్రసాద్ మంగళవారం మీడియాకు వివరాలు అందజేశారు. ఎదుర్లంకకి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.