మన్యం: ఉద్యానవన రంగంలో రాణించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ఉద్ఘాటించారు. విభిన్న రంగాల్లో మార్పు వచ్చినా ఉద్యాన రంగానికి తిరుగులేదని అన్నారు. మంగళవారం డా. వై.ఎస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో పట్టణంలోని ఉద్యాన కళాశాల 12వ అంతర కళాశాల సంస్కృతిక, సాహిత్య సమ్మేళనం 2025-26 ఘనంగా ప్రారంభించారు.