KRNL: పాండవగల్లు గ్రామంలోని సర్వే నంబర్ 135లో ఉన్న 20 ఎకరాల పెద్ద చెరువు కేసులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నేతలు ఇవాళ తీవ్రంగా విమర్శించారు. సబ్ కోర్టు, జిల్లా కోర్టులు చెరువును ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించినప్పటికీ అధికారులు స్వాధీనం చేసుకోలేదని ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.