NLG: శాలి గౌరారం ఊట్కూరు గ్రామపంచాయతీ భవనం కోసం దాత ఇచ్చిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి నిరసనగా ఉపసర్పంచ్ రంగు రాములు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా నిర్వహించారు. సర్పంచ్, ఆమె భర్త అక్రమంగా తక్కువ ధరకు భూమిని విక్రయించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.