KDP: ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయం వద్ద టీటీడీ అధికారులు భక్తులకు మూడు పూటలా నిత్య అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం నేరుగా అన్నదాన సత్రానికి వెళ్లి భక్తులతో మాట్లాడారు. ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, అధికారులు పాల్గొన్నారు.