TG: ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు రూ. 600 కోట్లు మంజూరు చేస్తామని CM రేవంత్ రెడ్డి చెప్పారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలలోపు అన్ని అంచనాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసి.. భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఛానెల్లో నిధులు మంజూరు చేస్తామన్నారు.