AP: రాజధానిపై వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ప్రపంచంలోనే మంచి అసెంబ్లీ భవనం ఏపీలో ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని ఎలా కడతారని వైసీపీ భ్రమలో ఉందని ఎద్దేవా చేశారు. రాజధాని కోసం చేసిన అప్పులు.. భూమి అమ్మకాల ద్వారా తీరుస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళిక లేదని ఆరోపించారు.