NRML: దిలార్పూర్ మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎజాజ్ హమీద్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రతి శాఖ అధికారి బాధ్యతతో పనిచేసి పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు.