KMM: రాజీ మార్గమే రాజమార్గమని వైరా ఎస్సై పి. రామారావు తెలిపారు. ఈ నెల 28న నిర్వహించే మెగా లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులను ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కోర్టు కేసుల నుంచి విముక్తి పొందేందుకు బాధితులు, ముద్దాయిలు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.