PPM: జిల్లాలో ఉపాధిహామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా జరుగుతున్న డోలి రోడ్లు, అభివృద్ధి పనులకు సంబంధించి ఈ నెల 25వ తేదీ సాయంత్రం నాటికి తప్పనిసరిగా బిల్లులు పూర్తి కావాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంజనీరింగ్ అధికారులతో ఎం.బుక్ నమోదు బిల్లులు చెల్లింపులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.