AKP: రావికమతం మండలం టి.అర్జాపురం పంచాయతీ పి.కొట్నాబిల్లి గ్రామంలో జీడీ రైతులు ఇవాళ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అకాల వర్షాలు, మంచు తెగులు వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని, కేజీకి రూ.200 మద్దతు ధర ప్రకటించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేయాలని కోరారు.