TG: ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన BRS నేత హరీష్.. దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్కు కాకుండా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి గల కారణమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ఎగుమతులపై టెండర్స్ పిలిచారా? కాకినాడ పోర్టులోని 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమయ్యాయి?’ అని ప్రశ్నించారు.