PPM: సాలూరు మండలం కరాసవలస పంచాయతీ పరిధిలో ఉన్న సిమిడివలస వద్ద రోడ్డుకు మధ్యలో గుంత ఏర్పడింది. రాత్రిపూట ఆ గొయ్యి కనిపించక వాహనదారులు అందులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.