AP: రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సరఫరా సమస్యపై సీఎం చంద్రబాబు ఇవాళ RTGS ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా గ్యాస్ కొరతను అధిగమించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రత్యామ్నాయంగా, అవసరమైన చోట తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించనున్నారు.