MNCL: తాండూర్ మండలం అచ్చులాపూర్కి చెందిన కొండపెల్లి బయమ్మ అనే వృద్ధురాలిపై ఆదివారం రాత్రి పిచ్చి కుక్కలు దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబసభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.