MBNR: బాలానగర్లో ఫోన్ హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు రూ.50 వేలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు రవి తెలిపిన వివరాలు.. ఫోన్ స్క్రీన్ గీతలు వచ్చి స్విచ్ ఆఫ్ అయింది. తిరిగి ఆన్ చేసి చూడగా ఖాతాలోని నగదు మాయమైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని లింకులు, యాప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.