NDL: శ్రీశైలం శిఖరేశ్వరం వద్ద కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులు వరుసలో రావడంలేదని ప్రశ్నించిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ చాంద్ భాషాను బలవంతంగా బస్సులో ఎక్కించి దోర్నాల వరకు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఇవాళ కేసు నమోదు చేసి, డ్రైవర్తో పాటు ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.