SRCL: నీటిని వృథా చేయవద్దని తంగళ్ళపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ అన్నారు. తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్లో ఆదివారం జల మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. నీటిని కేవలం ఒక వస్తువుగా కాకుండా అమూల్యమైన జాతీయ ఆస్తిగా భావించాలన్నారు. నీటి విషయంలో ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మిర్జా, అధికారులు ఉన్నారు.