KMM: తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం స్వర్ణభారతి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్ను మేయర్ పునకొల్లు నీరజ ప్రారంభించారు. ప్రముఖ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్న ఈ వేదిక విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమని ఆమె తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.