NLG: గడ్డి కట్టలు మిషన్ కడుతుండగా అక్కడే ఉన్న ఓ మహిళకు గాయాలైన సంఘటన వేములపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని సల్కునూరు గ్రామానికి చెందిన మమత తన పొలంలో గడ్డి కట్టలు కడుతుండగా ప్రమాదవశాత్తు మిషన్లో చెయ్యి పడింది. దీంతో తీవ్ర గాయాలవగా స్థానికులు 108కు ఫోన్ చేసి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.