నల్లగొండ క్యాంపు కార్యాలయంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన రూ.19 లక్షల విలువగల చెక్కులను 48 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు సీఎం నేతృత్వంలో అమలు అవుతున్నాయని చెప్పారు.