BHPL: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆధ్వర్యంలో ఈ నెల 23న నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లా నుంచి కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.