కోనసీమ: నిద్రమత్తు వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా SP రాహుల్ మీనా ఆదేశాలతో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అమలాపురం ‘స్టాప్ వాష్ అండ్ గో’ పేరుతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జాతీయ రహదారులపై వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను నిద్రమత్తు నుంచి అప్రమత్తం చేస్తూ పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు.