SDPT: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేసి, నేడు ఏ మొహం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ వెటర్నరీ కళాశాల, రంగనాయక సాగర్ టూరిజం, శిల్పారామం, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులకు నిధులను అర్ధాంతరంగా నిలిపేశారని మండిపడ్డారు.