BHNG: హైదరాబాద్లోని నార్సింగ్కు చెందిన అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం యాదగిరిగుట్టకు వచ్చింది. ఆమె తన కుటుంబ సభ్యులతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. తిరుగు ప్రయాణంలో అనిత కొండపై ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా.. సడెన్గా బస్సు కదిలింది. ఈ క్రమంలో అనిత కిందపడటంతో బస్సు ఆమె కాలు మీదుగా వెళ్లింది. ఆమెకు కాలుకు స్వల్పంగా గాయాలయ్యాయి.