ADB: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బోరజ్ మండలం మండగడలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రావు తెలిపారు. ఆదివారం గ్రామంలోని పాఠశాలలో శ్రీకృష్ణ, శ్రీ గణేష్ ఆస్పత్రుల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారన్నారు.