TPT: టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయని వైసీపీ నేత శ్యామల ఆరోపించారు. గోవుల మరణాలు, కొండపై మద్యం లభ్యత, తొక్కిసలాటలో భక్తుల మృతి వంటి ఘటనలపై ఆమె ధ్వజమెత్తారు. క్యూలైన్లలో భక్తులకు కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని విమర్శిస్తూ.. “మీ వీడియోలు బయటకొస్తే తప్పేంటి?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.