AKP: పాయకరావుపేట మండలం పాల్తేరులో శనివారం శ్రీరామనవమి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. రామాలయం ఆవరణలో పూజలు నిర్వహించి గ్రామస్తులు పెళ్లిరాట వేశారు. ఇందులో భాగంగా మహిళలు పసుపు దంచారు. ఈనెల 27న రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.