ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్-2026’ రెండో దశ కార్యక్రమాన్ని చేపట్టినట్లు SP నితిక పంత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు వారం రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించని వారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుటామని అన్నారు.