MHBD: జిల్లాలో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) B. సరిత తెలిపారు. ఈనెల 25వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని DAO సూచించారు. జిల్లాలో కొత్తగా పుస్తకాలు వచ్చిన 2,387 మంది రైతులు తమ సంబంధిత AEOలకు దరఖాస్తులు సమర్పించాలని DAO పేర్కొన్నారు.