సత్యసాయి: కదిరి పట్టణం ఈద్గా మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో సోదరభావం, శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పండుగ పూట ముస్లిం సోదరులతో కలిసి సమయం గడపడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.