MDK: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం సికింద్లాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జాతర సందర్భంగా MLA స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి జాతర ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.