AP: ముస్లింలకు మంత్రి లోకేష్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నెలవంక కనిపించింది.. నెలంతా కఠోర దీక్ష చేసిన ప్రతి మోము మురిసింది. ఉపవాస దీక్షతో పొందిన ఉపదేశం.. శాంతి, దానం ప్రతి మది నుంచి సమాజానికి చేరింది. రంజాన్ పండగ మీ కుటుంబాల్లో ఆనందాలు నింపాలని ఈద్ ముబారక్ తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.