హిమాచల్ ప్రదేశ్లోని షిప్కి లా కనుమ ద్వారా జూన్ 1 నుండి భారత్, చైనాల మధ్య వాణిజ్యం తిరిగి ప్రారంభం కానుంది. ఆరేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ వ్యాపారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నమ్ గ్యా గ్రామంలో దుకాణాలు, గిడ్డంగులు నిర్మిస్తామని కిన్నౌర్ కలెక్టర్ తెలిపారు. సైన్యం, కస్టమ్స్ అధికారుల సహాయంతో ఈ ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.