కోనసీమ: రావులపాలెం బస్టాండులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం వాడపల్లి వెళ్లే భక్తుల తాకిడితో బస్టాండు ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడింది. వచ్చిన బస్సులన్నీ కిక్కిరిసి ఉండడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు బస్సు ఎక్కలేక ఇబ్బందులు పడ్డారు. బస్సులు ఖాళీ లేక గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్తితి ఏర్పడిందని ప్రయాణికులు అంటున్నారు.