ADB: ఆదిలాబాద్ ఈద్గా మైదానంలో రంజాన్ ప్రార్థనల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వాహనదారులు పట్టణంలోని అంతర్గత రోడ్లు, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.