SRPT: నడిగూడెం మండలంలో రంజాన్ తోఫా పంపిణీలో అక్రమాలు జరిగాయని ముస్లిం మైనార్టీలు తహసీల్దార్ రామకృష్ణారెడ్డికి శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. మండలానికి 75 తోఫాలు కేటాయించగా, కేవలం 11 మాత్రమే వచ్చాయని ఆరోపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని ముస్లిం మైనార్టీల నాయకులకు హామీ ఇచ్చారు.