AP: రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అకాలవర్షాలు, ఈదురుగాలులు ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు మామిడి, మినుము, వరి, చెరుకు పంటలు దెబ్బతిన్నాయి.