సత్యసాయి: రంజాన్ పర్వదినం పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ శాంతి, సహనం, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లాలో వేడుకలు ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు.